మలేషియాలో అనిరుధ్ షో వాయిదా

22 Mar, 2014 13:32 IST|Sakshi
మలేషియాలో అనిరుధ్ షో వాయిదా

వై దిస్ కోలవెర్రి పాటకు సంగీతం అందించి సంగీత అభిమానులను మైమరిపించిన అనిరుధ్ మలేషియాలో నిర్వహించాల్సిన షో వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఆ షో మరల ఎప్పుడు నిర్వహించేది వెల్లడిస్తామన్నారు. విమానం గల్లంతు పట్ల సంతాప సూచికంగా షోను వాయిదావేసినట్లు శనివారం అనిరుధ్ ఈ మేరకు ట్విట్టర్లో పేర్కొన్నారు.


మలేషియా విమానం అదృశ్యమై రెండు వారాలు గడిచిన ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో దేశ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ఆ విమానంలోని ప్రయాణిస్తున్న తమ వారు సురక్షితంగా తిరిగి రావాలని వారి బంధువులు ప్రార్థనలు చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో షో వాయిదా వేసినట్లు చెప్పారు. అసలు అయితే ఈ నెల 29న అనిరుధ్ సంగీత విభావరి నిర్వహించవలసి ఉంది.


మార్చి 8వ తేదీన ఎంహెచ్ 370 విమానం కాలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తు అదృశ్యమైంది. ఆ విమానంలో 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బంది ఆచూకీ తెలియకుండా పోయారు. దాంతో మలేషియాతోపాటు దాదాపు 26 దేశాలు విమానం ఆచూకీ కోసం గాలింపులు చర్యలు చేపట్టాయి. అయిన ఫలితం కనిపించకపోవడంతో ఆ విమాన ప్రయాణికులు బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మలేషియా అంతట విషాదఛాయలు అలముకున్నాయి.

మరిన్ని వార్తలు