కేంద్ర మంత్రి మండలి తొలి సమావేశం

27 May, 2014 17:31 IST|Sakshi
నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి తొలిసారిగా సమావేశమైంది. సౌత్ బ్లాక్లోని ప్రధాని కార్యాలయంలో  కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా నల్లధనంపై చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటుపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఈ సమావేశంలో మంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్ధేశం చేస్తారు.  రాష్ట్ర విభజన అంశం గురించి ఉన్నతాధికారులు కేంద్ర కేబినెట్కు వివరిస్తారు. తొలి సమావేశంలో రాష్ట్ర విభజనకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు