నూజివీడులో విషాదం.. ముగ్గురి మృతి

12 Dec, 2016 13:53 IST|Sakshi

నూజివీడు(కృష్ణాజిల్లా): కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మత పరమైన కార్యక్రమంలో భాగంగా.. జెండాలు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ముగ్గురు యువకులు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణాజిల్లా ఎం.ఆర్ అప్పారావు కాలనీలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మహ్మద్ ప్రవక్త(సఅసం) పుట్టిన రోజు(మిలాదున్ నబి) సందర్భంగా ఎం. ఆర్ అప్పారావు కాలనీలో వేడుకలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా కాలనీని విద్యుద్దీపాలు, జెండాలతో అలంకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాలనీకి చెందిన షేక్ తన్వీర్, షేక్ ఇస్మాయిల్, షేక్ కాలేషాలు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులని నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

మరిన్ని వార్తలు