మాడ్రిడ్: స్పెయిన్లో చిన్నపాటి విమానం కూలిన దుర్ఘటనలో జర్మనీ దేశానికి చెందిన ముగ్గురు మరణించారు. శనివారం ముచమీల్ పట్టణం నుంచి గ్రెనడాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు చెప్పారు. గ్రెనడాకు 80 కిలో మీటర్ల దూరంలో పర్వత ప్రాంతంలో విమానం కూలినట్టు తెలిపారు.
మృతులను జర్మనీ వాసులుగా గుర్తించామని, ఆ దేశ కాన్సులేట్ కార్యాలయంతో సంప్రదిస్తున్నట్టు అధికారులు చెప్పారు. మరణించినవారు స్పెయిన్లో నివసించేవారా లేక టూరిస్టులా అన్న విషయం తెలియరాలేదని చెప్పారు. విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని వెల్లడించారు.