కాశ్మీర్లో ఎన్కౌంటర్: ముగ్గురు తీవ్రవాదుల హతం

3 Dec, 2013 12:04 IST|Sakshi

కాశ్మీర్లోని కుప్వారా జిల్లా రాజ్వార్ గ్రామంలో భద్రత దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన హోరాహోరి కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మరణించారని ఐజీపీ అబ్దుల్ ఘానీ మీర్ బుధవారం వెల్లడించారు. ఆ గ్రామంలోని ఓ ఇంట్లో తీవ్రవాదులు ఆశ్రయం పొందారని సమాచారం అందిందని ఆయన తెలిపారు. దాంతో భద్రత సిబ్బంది ఆ గ్రామానికి చేరుకుని, ఓ ఇంటిని చుట్టుముట్టారని ఆయన వివరించారు.

 

ఆ విషయం గమనించిన తీవ్రవాదులు భద్రత దళాలపై కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. దాంతో అప్రమత్తమైన భద్రత సిబ్బంది కాల్పులకు ఉపక్రమించారన్నారు. ఇరు వర్గాల మధ్య సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం వరకు ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయన్నారు.

మరిన్ని వార్తలు