కాళ్లు నరికి.. గొంతు కోసి.. దారుణ హత్య

12 Dec, 2016 15:03 IST|Sakshi
కాళ్లు నరికి.. గొంతు కోసి.. దారుణ హత్య
అది తూర్పు ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతం. తెల్లవారుజాము సమయం. రోడ్డు మధ్యలో ఒక తివాచీ మూటకట్టి ఉంది. అందులో ఏముందో మొదట ఎవరికీ తెలియదు. ఏంటా అని చూస్తే.. అందులో ఒక యువకుడి మృతదేహం ముక్కలు ముక్కలుగా ఉంది. అక్కడకు కొన్ని మీటర్ల దూరంలో అతడి కాళ్లు విడిగా పడి ఉన్నాయి. దాంతో ఒక్కసారిగా షాకైన ఆ ప్రాంత వాసులు.. పోలీసులకు ఫోన్ చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజిని తాము పరిశీలించామని, ఇద్దరు వ్యక్తులు ఆ మృతదేహాన్ని, దాని భాగాలను విడివిడిగా పారేయడం కనిపించిందని డీసీపీ రోమిల్ బానియా తెలిపారు. హంతకులు అతడి గొంతు కోసేశారు. అతడి ముఖం మీద ఏదో ఒక బరువైన వస్తువుతో కొట్టారు. ముఖంలో కూడా కొంత భాగాన్ని చెక్కేశారు. మృతదేహాన్ని మూట కట్టడానికి వీలుగానే కాళ్లు నరికేసి ఉంటారని పోలీసులు చెప్పారు. 
 
మృతుడి వయసు సుమారు 35 ఏళ్ల ప్రాంతంలో ఉంటుందని, అతడు తెల్ల షర్టు, లుంగీ ధరించి ఉన్నాడని చెప్పారు. హత్య జరిగే సమయానికి అతడు బాగా తాగేసి ఉంటాడని అంటున్నారు. ఆ ప్రాంతం నుంచి ఎవరూ తప్పిపోయినట్లు తమకు ఫిర్యాదు అందలేదని, మృతుడి వివరాలు కూడా ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు. ఇద్దరు వ్యక్తులు ఆటోలో వచ్చి, తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో అక్కడ ఆ మృతదేహాన్ని పడేసినట్లు సీసీటీవీ ఫుటేజిలో కనిపించింది. అయితే నిందితుల ముఖాలు గానీ, ఆటో నంబరు ప్లేటు గానీ స్పష్టంగా కనిపించలేదు. ముందుగానే ఎక్కడో హత్యచేసి, మృతదేహాన్ని ఇక్కడకు తెచ్చి పారేసి ఉంటారని పోలీసులు చెప్పారు.
>
మరిన్ని వార్తలు