పక్షి ఢీకొని.. ఆగిపోయిన విమానం

5 Aug, 2014 15:55 IST|Sakshi

సింగపూర్కు చెందిన టైగర్ ఎయిర్ వేస్ విమానం ఒకటి పక్షి ఢీకొనడంతో ఆగిపోయింది. 167 మంది ప్రయాణికులతో తిరుచిరాపల్లి నుంచి బయల్దేరాల్సిన ఈ విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో పక్షీ ఢీకొనడంతో దాని ఇంజన్ దెబ్బతింది. దాంతో విమానం టేకాఫ్ తీసుకోకుండానే ఆగిపోయింది.

ఇంజన్లో ఏదో సమస్య తలెత్తిందని గుర్తించిన పైలట్.. దాన్ని ఎగరనివ్వకుండా ఆపేశారు. మొత్తం ప్రయాణికులందరినీ విమానం నుంచి దించేసి వారిని ఓ హోటల్లో ఉంచారు. తర్వాత చెన్నై నుంచి ఇంజనీర్లు విడిభాగాలతో వచ్చి, సమస్యను సరిచేసిన తర్వాత అప్పుడు విమానాన్ని బయల్దేరదీశారు.

మరిన్ని వార్తలు