నేడు విద్యా సంస్థల బంద్

4 Aug, 2015 01:18 IST|Sakshi

పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘాలు
సాక్షి, హైదరాబాద్: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇంటర్, డిగ్రీ కళాశాలల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఫీజుల నియంత్రణ చట్టాన్ని రూపొందించడం, ప్రభుత్వ ఇం టర్, డిగ్రీ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీ, మౌలిక వసతుల కల్పన, ప్రైవేటు కాలేజీడ లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్ల సాధనకు బంద్ చేపట్టనున్నట్లు పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సత్య తెలిపారు.

>
మరిన్ని వార్తలు