ట్రాయ్ చైర్మన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

10 Sep, 2016 19:27 IST|Sakshi

న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) చైర్మన్ ఆర్ఎస్ శర్మ ట్విట్టర్ అకౌంట్ శనివారం హ్యాంకింగ్ కు గురైంది. శర్మ అకౌంట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ఆయన గురించి అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై ప్రకటన విడుదల చేసిన ట్రాయ్ అధికారులు.. మెసేజ్ లలో ఉన్న సారాంశంపై స్పందించొద్దని కోరారు.

శర్మ ప్రస్తుతం అధికారిక పనుల మీద ఫిజి, ఆస్ట్రేలియాల పర్యటనకు వెళ్లినట్లు తెలిపారు. టెలికాం సంస్థల ఆర్ధిక విషయాలపై రెగ్యులేటరీ పాత్ర కాన్ఫరెన్స్ కోసం ఆయన ఆస్ట్రేలియా వెళ్లినట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు