విమాన దుర్ఘటనలో తెలుగు పైలట్ మృతి

19 Nov, 2013 15:56 IST|Sakshi
విమాన దుర్ఘటనలో తెలుగు పైలట్ మృతి

హైదరాబాద్ : అమెరికా విమాన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన పైలెట్ మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కర్నూల్ జిల్లాకు చెందిన చామకూర కార్తీక్ ఈ ఘటనలో మృత్యవాత పడినట్లు మంగళవారం హూక్స్ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ఆదివారం సెసీనా 172 విమానంలో సాంకేతిక లోపం సంభవించడంతో ప్రమాదం జరిగింది.  సింగిల్ ఇంజిన్ తో నడిచే సెసీనా పేలిపోవడంతో కార్తీక్ అసువులు బాసాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు.

 

గత సెప్టెంబర్ లోనే అమెరికాకు వెళ్లిన  కార్తీక్ మృతిపట్ల బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.అతని తండ్రి బీఎస్ఎన్ఎల్ అధికారి. ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీలో శిక్షణ తీసుకున్నకార్తీక్ పూర్తి విద్యాభ్యాసం హైదరాబాద్లోనే సాగింది.

మరిన్ని వార్తలు