అవినీతి ఆరోపణల కేసులో ప్రముఖ టీవీ నటుడు అనూజ్ సక్సేనా గురువారం ఢిల్లీ కోర్టు ముందు లొంగిపోయారు. ఇదే కేసులో సహ నిందితుడిగా ఉన్న సీనియర్ అధికారి బీకే బన్సల్, ఆయన భార్య, కుమారుడు గత ఏడాది ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే.
ఈ నెల 17లోపు కోర్టులో సరెండర్ కావాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రత్యేక జడ్జీ గుర్దీప్ సింగ్ ముందు ఆయన లొంగిపోయారు. కంపెనీ చట్టానికి విరుద్ధంగా సక్సెనా కంపెనీ 24వేల మంది చిన్న పెట్టుబడిదారుల నుంచి రూ. 175 కోట్లను సేకరించింది. ఈ నిధులపై ఎస్ఎఫ్ఐవో తనిఖీలు జరగకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ బీకే బన్సల్కు సక్సేనా లంచం ఇచ్చారని, ఈ కేసులో ఆయనే ప్రధాన లబ్ధిదారుడని సీబీఐ వాదిస్తోంది.