టీవీకే శాస్త్రి ఇక లేరు

4 Mar, 2014 01:46 IST|Sakshi
టీవీకే శాస్త్రి ఇక లేరు

అనారోగ్యంతో చెన్నైలో మృతి
 చెన్నై, న్యూస్‌లైన్: భారతీయ కళల పరిరక్షణకు కృషి చేసిన కళాపిపాసి టి.వి.కె. శాస్త్రి (80) అనారోగ్యంతో ఆదివారం రాత్రి చెన్నైలో తుది శ్వాస విడిచారు. శాస్త్రి ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలిలో జన్మించి, అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని చెన్నైలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. అప్పటి మద్రాసు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి ఆర్‌ఎస్‌ఆర్‌కే రంగారావుకు సన్నిహితంగా ఉండి సంస్థానం కార్యక్రమాలు చూసేవారు. అనంతరం కళాసాగర్ సంస్థలో పని చేస్తుం డగా సంగీత విధ్వాం సులు, కళాకారులు, రాజకీయ, సినీ రంగ ప్రముఖులతో సంబంధాలు ఏర్పడ్డాయి.
 
 చెన్నై, టీనగర్‌లో ఉంటున్న శాస్త్రి 1981లో పుట్టపర్తి సత్యసాయి ఆశీస్సులు, సూచనలు మేరకు జాతి సమైక్యత కోసం అన్ని రంగాల కళాకారులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు మద్రాసు తెలుగు అకాడమీ, భారత్ కల్చరల్ సమైక్యతా కమిటీ (బీసీఐసీ)లను స్థాపించారు. మద్రాసు తెలుగు అకాడమీకి చీఫ్ కన్వీనర్‌గా 1981 నుంచి 2008 వరకు పని చేసి 78 ఫెస్టివల్స్ నిర్వహించారు. ఈ రెండు సంస్థల ద్వారా కళాకారులను, విద్యార్థులను ప్రోత్సహించే విధంగా నాటకాలు, సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శాస్త్రికి  భార్య లక్ష్మి, కుమారుడు రామప్రసాద్, కుమార్తెలు విజయలక్ష్మి, సాయిశ్రీ ఉన్నారు. శాస్త్రి అంత్యక్రియలను బుధవారం ఉదయం చెన్నైలో నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు