మావోయిస్టులు అరెస్ట్ :భారీగా మందుపాతర్లు స్వాధీనం

31 Mar, 2014 12:41 IST|Sakshi

ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా దౌడాయి అటవీ ప్రాంతంలో సోమవారం మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురు కాల్పులకు తట్టుకోలేక మావోయిస్టులు పరారైయ్యారు. ఆ క్రమంలో పోలీసు బలగాలు ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని తమ దైన శైలిలో పోలీసులు విచారించారు.

 

దాంతో దంతెవాడ జిల్లా నకుల్నార్ అటవీ ప్రాంతంలో భారీగా మందుపాత్ర నిల్వ ఉంచినట్లు వారు పోలీసులకు తెలిపారు. దాంతో పోలీసులు నకుల్నార్ అటవీ ప్రాంతంలో నిల్వ  ఉంచిన మందుపాత్రలను పోలీసులు భారీ సంఖ్యలో స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
 

>
మరిన్ని వార్తలు