ఇద్దరు ఉగ్రవాదులు హతం

15 Oct, 2015 08:39 IST|Sakshi

జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్ చోటుచేసుకుని ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దోడా జిల్లాలో ఈ ఘటన గురువారం వేకువ జామున చోటుచేసుకున్నట్లు మిలటరీ అధికార ప్రతినిధి తెలిపారు. దోడా జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు బలగాలకు సమాచారం అందడంతో స్థానిక పోలీసుల సహాయంతో సైన్యం ఉగ్రవాదులను వేటాడే కార్యక్రమం ప్రారంభించింది. వారిని వెతికే క్రమంలో కొందరు ఉగ్రవాదులు తారసపడగా ఎన్ కౌంటర్ చోటుచేసుకుని ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

మరిన్ని వార్తలు