వాషింగ్టన్: అమెరికాలో ఇద్దరు భారతీయ సిక్కులను ముసుగు ధరించిన ఇద్ద రు దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. భారత్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన జగ్తార్ సింగ్ భట్టి(55) అమెరికాలోని ఉత్తర ఇండియానా నగరంలో ఓ పచారీ దుకాణం నిర్వహిస్తున్నారు. పంజాబ్కే చెందిన పవన్ ప్రీత్ సింగ్(20) భట్టికి సహాయకుడిగా ఉంటున్నారు. గురువారం ఇరువురూ దుకాణంలో ఉన్న సమయంలో ఇద్దరు ముసు గు ధరించిన దుండగులు కాల్పులకు దిగినట్టు ప్రత్యక్ష సాక్షులు వివరించారు.
.