‘ఉబర్‌’ డ్రైవర్‌కు సెల్ఫీ తప్పనిసరి

15 Mar, 2017 08:42 IST|Sakshi

న్యూఢిల్లీ: ట్యాక్సీ సేవల సంస్థ ఉబర్‌ భద్రతా చర్యల్లో భాగంగా భారత్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై ప్రయాణికుడిని ఎక్కించుకునే ముందు సంస్థ అధికారిక యాప్‌లో ప్రతీ ఉబర్‌ డ్రైవర్‌ తన సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ సెల్ఫీని సంస్థ తమ డేటాబేస్‌లో డ్రైవర్‌ వివరాలతో పోల్చిచూస్తుంది.

సంస్థలో నమోదైన డ్రైవర్‌ కాకుండా మరొక వ్యక్తి క్యాబ్‌ను నడుపుతున్నట్లయితే ఆ క్యాబ్‌ ప్రొఫెల్‌ను తాత్కాలికంగా నిషేధిస్తామని సంస్థ తెలిపింది. ఈ ఫీచర్‌ను మొదటగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా క్యాబ్‌ సర్వీసుల్లో ప్రవేశపెట్టనుంది.

మరిన్ని వార్తలు