ఎమ్మెల్యేలపై దాడులు దుర్మార్గం: ఉమ్మారెడ్డి

12 Jul, 2015 21:47 IST|Sakshi
ఎమ్మెల్యేలపై దాడులు దుర్మార్గం: ఉమ్మారెడ్డి

హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై టీడీపీ నేతల దాడిని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. అవినీతి, దౌర్జన్యాలను జోడెద్దులుగా టీడీపీ సర్కార్ నడిపిస్తోందని మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆఖరికి ఎమ్మెల్యేలపై కూడా దాడులు దుర్మార్గమని చెప్పారు. ఈ ఘటన ఇసుకమాఫియా వికృతచేష్టలకు పరాకాష్ట' అని అన్నారు. అధికారం శాశ్వతం కాదని టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని ఉమ్మారెడ్డి హితవు పలికారు.

కాగా, తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం డీ పోలవరంలో తెలుగు తమ్ముళ్లు ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడటంపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు దాడిశెట్టి ఎమ్మెల్యే గన్మెన్పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు