పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దొంగలు బంగారు అభరణాలపై కన్నేసినట్టు కనిపిస్తోంది. ఇటీవలికాలంలో బంగారం దొంగతనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా గుజరాత్లోని అహ్మదాబాద్లో భారీ దోపిడీ జరిగింది. అహ్మదాబాద్లోని సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ కంపెనీపై దుండగులు విరుచుకుపడ్డారు.
సెక్యూరిటీగార్డుపై దాడి చేసి.. ఏకంగా పదికిలోల బంగారాన్ని అపహరించుకొనిపోయారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బంగారంతో ఊడాయించిన దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.