బోయ్ఫ్రెండు పట్టించుకోలేదని.. హీరోయిన్ ఆత్మహత్య

3 Sep, 2014 20:09 IST|Sakshi
బోయ్ఫ్రెండు పట్టించుకోలేదని.. హీరోయిన్ ఆత్మహత్య

సినిమా అవకాశాలు లేకపోవడం, బోయ్ఫ్రెండు పట్టించుకోకపోవడంతో సయ్యమ్ ఖన్నా అలియాస్ మోనా ఖన్నా అనే హిందీనటి ఆత్మహత్య చేసుకుంది. ముంబై యారి రోడ్డులోని తన ఫ్లాట్లో ఆదివారం తెల్లవారుజామున సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఉండగా ఆమె సోదరి రియా గమనించి పోలీసులకు తెలిపింది. 'ద హాంటెడ్ హౌస్' అనే చిత్రంలో సయ్యమ్ నటించింది. ఆమె నటించిన మరో సినిమా 'ద లాస్ట్ హర్రర్' ఇంకా విడుదల కావాల్సి ఉంది. డెహ్రాడూన్లో చదువకునే రియా.. తన సోదరితో కలిసి ఉందామని జూలై 22న ముంబైకి వచ్చింది. వీళ్ల తల్లిదండ్రులిద్దరూ గతంలోనే మరణించారు. మొన్న కూరగాయలు తేవాలని రియాకు చెప్పిన సయ్యమ్.. వెళ్లేముందు ఆమెను కౌగలించుకుని, నిన్నెంతో ప్రేమిస్తున్నా అంటూ చెప్పింది. తిరిగి వచ్చాక అన్నం తిని పడుకోవాలని, తనను డిస్ట్రబ్ చేయొద్దని చెప్పింది.

అర్ధరాత్రి వరకు టీవీ చూసిన రియా.. తీరా టీవీ కట్టేసే సమయానికి అక్క గదిలోంచి పాటలు వినిపిస్తుండటంతో ఐపాడ్ కట్టకుండా పడుకుందేమోనని లోనికి వెళ్లింది. దీరా చూస్తే. అప్పటికే ఫ్యాన్కు ఉరేసుకుని ఉంది. సయ్యమ్ తాను రాసిన సూసైడ్ నోట్లో తన చావుకు ఎవరూ బాధ్యులు కారని చెప్పింది. అదే లేఖను తన సోదరికి జీమెయిల్ ద్వారా కూడా పంపింది.

అయితే, ప్రముఖ నటుడి కుమారుడు ఒకరు తన సోదరిని ప్రేమించాడని, అతడు తరచు ఆమెను తిట్టి, కొట్టేవాడని రియా చెబుతోంది. సంఘటన జరగడానికి ముందురోజు సాయంత్రం ఆమె అతడిని కలవడానికి వెళ్లిందని, తిరిగి వచ్చేసరికి బాగా డిప్రెషన్తో కనిపించిందని తెలిపింది. అతడే ఏదో అనడం వల్ల ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఆరోపించింది. లేకపోతే అసలు తన సోదరి చనిపోయేంత పిరికిది కాదని తెలిపింది. అయితే తాను ఒంటరిదాన్ని కావడం, ఎవరూ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేంత ధైర్యం చేయలేదంది.

మరిన్ని వార్తలు