త్రివిధ దళాధిపతులతో మోదీ భేటీ

24 Sep, 2016 13:57 IST|Sakshi
త్రివిధ దళాధిపతులతో మోదీ భేటీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. శనివారం ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసం లోక్ కల్యాణ్ మార్గ్ 7లో ఈ భేటీ జరిగింది.

ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్, ఎయిర్ చీఫ్‌ మార్షల్ అరుప్ రహ, నౌకదళం ఉప అధిపతి వైస్ అడ్మిరల్ కేబీ సింగ్తో పాటు జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. నౌకదళం చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా ఢిల్లీలో లేకపోవడంతో ఆయన బదులు కేబీ సింగ్ వచ్చారు. యురిలో సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రధాని మోదీ పరిస్థితిని సమీక్షించారు. ఈ దాడికి బదులిచ్చే విషయంపై ప్రధాని మోదీ చర్చించారు.

మరిన్ని వార్తలు