వేదాంత, కెయిర్న్ మెర్జర్ కు షేర్ హోల్డర్స్ గ్రీన్ సిగ్నల్

9 Sep, 2016 22:08 IST|Sakshi

ప్రముఖ మైనింగ్‌ సంస్థ వేదాంత లిమిటెడ్‌..కెయిర్న్ ఇండియా  విలీనానికి  షేర్ హోల్డర్స్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  ఈ విలీన ప్రతిపాదనకు మదుపర్లు, సెక్యూర్డు, అన్‌సెక్యూర్డ్‌ రుణదాతలు అంగీకారం తెలిపారు. ఈ విషయాన్నివేదాంత రెగ్యులేటరీ ఫైలింగ్లో శుక్రవారం తెలిపింది.   గోవాలో గురువారం జరిగిన ప్రతిపాదన ఓటింగ్‌కు వేదాంత లిమిటెడ్‌ మదుపర్లు  అనుమతినిచ్చారని తెలిపింది. ఈ మెర్జర్ ద్వారా దేశంలో అతిపెద్ద విభిన్నమైన సహజ వనరులను సంస్థగా అవతరించాలనేది అగర్వాల్ ప్రణాళిక.  సవరించిన ఆఫర్ ప్రకారం10 రూపాయల ముఖ విలువ గల షేర్ కు నాలుగు ప్రిఫరెన్షియల్  షేర్లను మైనారిటీ  వాటాదారులకు అందించనుంది.


అయితే వేదాంత అసలు పరీక్షను సెప్టెంబర్‌ 12న ఎదుర్కోనుంది. విలీన ఒప్పందంపై స్టేక్‌ హోల్డర్ల అభిప్రాయం తెలుసుకునేందుకు కెయిర్న్‌ ఇండియా ఆరోజునే సమావేశం నిర్వహించనుంది. అక్కడ అంగీకారం లభిస్తేనే ప్రక్రియ ముందుకు సాగుతుంది. కోటీశ్వరుడు అనిల్‌ అగర్వాల్‌  నేతృత్వంలో  ముందుకు సాగుతున్న ఈ వ్యవహారంలో ఇటీవల వేదాంత రిసోర్సెస్, వేదాంత లిమిటెడ్ మాతృ సంస్థ యొక్క వాటాదారులు మెర్జర్ ను అనుమతించిన విషయం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు