'అప్పుడు ఎందుకు చట్టబద్ధత కల్పించలేదు'

20 Oct, 2015 18:47 IST|Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను విస్మరించిందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విమర్శించారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిందని ఆరోపించారు.

కాంగ్రెస్ ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చాక ఇప్పుడు ప్రత్యేక హోదా విషయం గుర్తొచ్చిందని వెంకయ్య నాయుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి ఎందుకు చట్టబద్ధత కల్పించలేదని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు