అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయంట..!

8 Sep, 2015 02:02 IST|Sakshi
అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయంట..!

కర్నూలు జిల్లా ప్యాపిలి మండల పరిధిలోని ఎన్.రంగాపురం గ్రామంలో ప్రజలు వజ్రాల వేటలో పడ్డారు. గ్రామంలో ఇటీవల పలువురికి వజ్రాలు లభ్యమైనట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతం చేరుకున్నారు. ఏ చిన్న రంగురాయిని కూడా వదిలి పెట్టకుండా సేకరిస్తున్నారు. వజ్రాన్వేషకుల బైక్‌లు పొలాల వద్ద పెద్ద ఎత్తున నిలిపి ఉండటం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.    - ప్యాపిలి



మరిన్ని వార్తలు