'బూటకపు స్వాతంత్య్ర దినంగా పాటించాలి'

12 Aug, 2015 16:09 IST|Sakshi

చర్ల (ఖమ్మం): సీపీఐ మావోయిస్టు ఖమ్మం జిల్లా కమిటీ పేరుతో పోస్టర్లు ఖమ్మం జిల్లా చర్ల మండలంలో రహదారిపై బుధవారం దర్శనమిచ్చాయి. ప్రజలకు ఇంకా పూర్తి స్వాతంత్య్రం రాలేదని, ఆగస్ట్ 15ను బూటకపు స్వాతంత్య్ర దినంగా పాటించాలని మావోయిస్టులు ఆ ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆదివాసీలపై అధికంగా అత్యాచారాలు జరుగుతున్నాయని, పీడిత ప్రజలైన ఆదివాసీలకు ఇంకా పూర్తి హక్కులు రాలేదని పేర్కొన్నారు. బ్రిటిష్ వారి నుంచి రాజ్యాధికారం బదిలీ అయినా, పెట్టుబడి, భూస్వామ్య వర్గాల చేతుల్లో పరిమితమైందన్నారు. భారతదేశంలో ఇంకా అన్ని వర్గాలు, ప్రజలకు స్వాతంత్య్రం రానప్పుడు... స్వాతంత్యదినం అని ఎలా అంటారని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు