'ఏపీకి అవసరమైన సహాయాన్ని అందిస్తాం'

18 Oct, 2014 18:27 IST|Sakshi
'ఏపీకి అవసరమైన సహాయాన్ని అందిస్తాం'

ఢిల్లీ:తుపాను ప్రభావంతో భారీగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు అవసరమైన సహాయాన్ని అందిస్తామని కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు. దీనిపై ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు. తుపాను కారణంగా పంట నష్టపోయిన వివరాలను కేంద్రానికి పంపాలని రాధామోహన్ సింగ్ తెలిపారు.

 

గత మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు రూ. వెయ్యి కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు