'అప్పటి వరకు వేచి చూస్తాం'

6 Aug, 2015 12:00 IST|Sakshi
'అప్పటి వరకు వేచి చూస్తాం'

న్యూఢిల్లీ: హైకోర్టు విభజన అంశంపై కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూస్తామని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. గురువారం ఆమె పార్లమెంటు వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగుల విభజన త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు మార్గదర్శకాలున్నాయని, జిల్లా, మండల స్థాయి ఉద్యోగులకు లేవని కవిత చెప్పారు. నేడు కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి అన్ని అంశాలు వివరిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు