సోషల్ మీడియాలో పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 2016 ఏడాది చివరిలో షాకివ్వబోతోంది. ఈ ఏడాది చివరికల్లా మిలియన్ కొద్దీ స్మార్ట్ఫోన్లకు వాట్సాప్ రద్దుకాబోతున్నట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. అప్గ్రేడ్ కాని పక్షంలో వీరికి వాట్సాప్ తన సేవలను నిలిపివేయనుందని తెలుస్తోంది. టెక్నాలజీ అప్గ్రేడ్ కాని పాత ఫోన్లకు దశలవారీగా వాట్సాప్ తన సేవలను రద్దుచేస్తున్నట్టు మిర్రర్ రిపోర్టు వెల్లడించింది. ఈ ప్రభావం మిలియన్ల కొద్దీ స్మార్ట్ఫోన్లపై పడనుందని తెలిపింది. మెసేజింగ్ యాప్లో ఎక్కువగా పేరొందిన ఈ యాప్కు నెలకు 100 కోట్ల మంది యూజర్లున్న సంగతి తెలిసిందే. వచ్చే ఆరు తరాలపై తాము దృష్టిసారిస్తున్నామని, ఎక్కువమంది యూజర్లు వాడే మొబైల్ ఫ్లాట్ఫామ్లపై తాము ఎక్కువగా దృష్టిసారించినట్టు వాట్సాప్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. 2017 నుంచి తమ పాత సర్వీసులను నిలిపివేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.
ఐఫోన్ 3జీఎస్ స్మార్ట్ఫోన్లోనూ, ఐవోఎస్ 6 డివైజ్తో రన్ అయ్యే వాటికి వాట్సాప్ సపోర్టు చేయడం ఆగిపోతుందని మాంచెస్టర్ ఈవినింగ్ న్యూస్ రిపోర్టు చేసింది. అదేవిధంగా అప్డేట్ కానందున్న మొదటి, రెండో, మూడో, నాలుగో తరం ఐప్యాడ్లకు వాట్సాప్ తన సర్వీసులను నిలిపివేస్తుందని పేర్కొంది. యూజర్లు ఐవోఎస్ 9.3కి అప్డేట్ అయి, వాట్సాప్ సర్వీసులను వినియోగించుకోవచ్చని రిపోర్టు తెలిపింది. ఆండ్రాయిడ్ 2.1. 2.2 ఆపరేటింగ్ సిస్టమ్లతో రన్ అయ్యే ఫోన్లు, టాబ్లెట్లకు ఈ ఏడాది చివరి నుంచి వాట్సాప్ సేవలు సపోర్టు చేయవు. విండోస్ 7తో రన్ అయ్యే డివైజ్లు కూడా ఈ సేవలను వినియోగించుకోవాలంటే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని రిపోర్టులు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే బ్లాక్బెర్రీ ఓఎస్, బ్లాక్బెర్రీ 10, నోకియా ఎస్40, నోకియా సిమ్బియాన్ ఎస్ 60 డివైజ్లకు 2017 జూన్ 30 వరకు తమ సేవల సపోర్టును వాట్సాప్ పొడిగించింది.