'టీడీపీ నేతల పంచెలు తడుస్తున్నాయి'

2 Sep, 2015 10:22 IST|Sakshi
'టీడీపీ నేతల పంచెలు తడుస్తున్నాయి'

హైదరాబాద్: కుట్రతోనే అసెంబ్లీ లాంజ్ లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో తొలంగించారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్ పంచెకట్టు చూసి టీడీపీ నాయకుల పంచెలు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు.

ఐదేళ్లు అసెంబ్లీ లాంజ్ లో ఉన్న వైఎస్సార్ ఫోటోను ఇప్పుడు తొలగించడమేంటని ఆమె ప్రశ్నించారు. వైఎస్సార్ ఫోటోను తొలగించారు కానీ.. ప్రజల గుండెల్లో నుంచి ఆయన్ని తొలగించలేరని చెప్పారు. వైఎస్సార్ బతికివుంటే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉండేవి కావని అన్నారు. చంద్రబాబు సీఎం కాగానే కరువు వచ్చిందని అనుకుంటున్నారని రోజా చెప్పారు.

మరిన్ని వార్తలు