డాన్సు చేయనందని.. భార్యను పైనుంచి తోసేశాడు!

16 May, 2017 14:59 IST|Sakshi
డాన్సు చేయనందని.. భార్యను పైనుంచి తోసేశాడు!

పెళ్లి జరుగుతుంటే తనతో పాటు డాన్సు చేయలేదని ఓ తాగుబోతు భర్త తన భార్యను మేడ మీద నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లా చిల్లాఘాట్ పట్టణం సమీపంలోని డిఘ్వాట్ గ్రామంలో జరిగింది. దాంతో విశాఖ తివారీ (28) అనే ఆ మహిలకు రెండు కాళ్లు విరిగిపోయాయి. ఆమె తలకు, ఉదరభాగంలోను కూడా గాయాలయ్యాయి. డిఘ్వాట్ గ్రామంలో జరుగుతున్న తన బంధువుల పెళ్లికి విశాఖ తన భర్తతో కలిసి వెళ్లింది. అక్కడ 'కలేవా' అనే తంతు జరుగుతుండగా ఆమె భర్త అజయ్ తనతోను, ఇతర అతిథులతోను కలిసి డాన్సు చేయాలని ఆమెను కోరాడు. కానీ ఆమె అందుకు నిరాకరించింది.

దాంతో బాగా కోపం వచ్చిన ఆ భర్త.. ఆమెను మేడ మీద నుంచి కిందకు తోసేశాడు. అతడిపై పోలీసులు కేసు నమోదుచేశారు. బాధితురాలిని జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న ఆమె భర్త కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు