అత్యాచారంపై తప్పుడు ఫిర్యాదు... మహిళకు శిక్ష

3 Sep, 2013 06:31 IST|Sakshi

ఇండోర్: తనపై అత్యాచారం చేసినట్లు ఒక వ్యక్తిపై తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.11 వేల జరిమానా విధిస్తూ ఇండోర్ అదనపు సెషన్స్ జడ్జి ఇందిరా సింగ్ తీర్పునిచ్చారు. చంచల్ రాఠోడ్ (35) అనే మహిళ తనపై తన ఇంటి యజమాని రూప్‌కిశోర్ అగర్వాల్ (53) అత్యాచా రానికి పాల్పడ్డారంటూ 2012 డిసెంబర్‌లో పలాసియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీని ఫలితంగా రూప్‌కిశోర్ రెండున్నర నెలలు జైలులో గడపాల్సి వచ్చింది. జైలు నుంచి విడుదలయ్యాక మనస్తాపంతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, గత మే 13న అదనపు సెషన్స్ జడ్జి సవితా దుబే విచారణ జరిపినప్పుడు చంచల్ మాట మార్చింది.

>
మరిన్ని వార్తలు