'దేశమంతా ఆ పరిస్థితి లేదు'

9 Nov, 2015 14:24 IST|Sakshi
'దేశమంతా ఆ పరిస్థితి లేదు'

న్యూఢిల్లీ: బిహార్ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. బిహార్ ఎన్నికల ఫలితాలపై సమగ్రంగా విశ్లేషించుకుంటామని తెలిపారు. సోమవారం రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) భేటి తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బిహార్ ప్రజలు తమ ఆశలను ఈ ఎన్నికల్లో వ్యక్తపరిచారని చెప్పారు.

బిహార్ ఎన్నికల ఫలితాలతో శీతాకాల పార్లమెంట్ సమావేశాలను ఎటువంటి ఆటంకం కలగదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బిహార్ ఉన్న రాజకీయ పరిస్థితే దేశమంతా ఉందన్న వాదనతో ఆయన విభేదించారు. బిహార్ రాష్ట్రంలో మాత్రమే ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

>
మరిన్ని వార్తలు