మార్పు కోసం ధైర్యంగా ముందుకు కదలండి

8 Mar, 2017 05:21 IST|Sakshi
మార్పు కోసం ధైర్యంగా ముందుకు కదలండి

- మహిళలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
- అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ప్రతిపక్ష నేత


సాక్షి, హైదరాబాద్‌:
మార్పు కోసం మహిళలు ధైర్యంగా ముందుకు కదలాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మంగళవారం మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారిత ద్వారానే సాంఘిక, ఆర్థిక స్వావలంబన సాధ్యమని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే సాధికారిత సాధ్యమవుతుందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు