తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తిరుపతికి వెళ్లనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానం చేసిన ముని కామకోటి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
ఈ రోజు మధ్యాహ్నం వైఎస్ జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుపతికి వెళ్లనున్నారు. తిరుపతి మంచాలవీధిలోని కోటి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ తిరుపతిలోఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కోటి.. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.