దాసరికి నివాళులర్పించిన వైఎస్‌ జగన్‌

11 Jun, 2017 14:11 IST|Sakshi

హైదరాబాద్‌: దివంగత సినీ దర్శకుడు దాసరి నారాయణరావు సంస్మరణ సభ ఆదివారం నగరంలోని ఇమేజ్‌ గార్డెన్‌లో జరిగింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సభకు హాజరయ్యారు. దివంగత దాసరి విగ్రహానికి పూలమాల వేసి వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. దాసరి సేవలను కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. విదేశాల్లో ఉండటంతో దాసరిని కడసారి వైఎస్‌ జగన్‌ చూడలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా దాసరి సంస్మరణ సభకు హాజరై నివాళులర్పించారు.

సినీ, రాజకీయ, మీడియా రంగాలలో అపారమైన కృషి చేసిన దాసరి నారాయణరావు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ శనివారం నగరంలోని ఫిలించాంబర్‌లోనూ సంస్మరణ సభ నిర్వహించారు.