పేద ప్రజల సంక్షేమానికి చిరునామాగా నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 66వ జయంతి నేడు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడుల్లోని ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ జయంతిని ఘనంగా జరుపుకునేందుకు సన్నద్ధమయ్యాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా, నియోజకవర్గాల కేంద్రాల్లో జరిగే సేవా కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు.