ఏపీటీఏ సదస్సుకు వెళ్లిన బొత్స సత్యనారాయణ

3 Sep, 2015 14:17 IST|Sakshi
ఏపీటీఏ సదస్సుకు వెళ్లిన బొత్స సత్యనారాయణ

వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమెరికా బయల్దేరి వెళ్లారు. అక్కడి మేరీలాండ్లో జరిగే ఏపీటీఏ తూర్పు సదస్సులో పాల్గొనడంతో పాటు.. వైఎస్ఆర్సీపీ అమెరికా కమిటీ సమావేశాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడ పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.

ఇంకా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరో వర్ధంతి సందర్భంగా అమెరికాలోని మేరీలాండ్, డల్లస్, డెట్రాయిట్, హార్ట్ఫోర్డ్ తదితర పలు రాష్ట్రాల్లో జరిగే సామాజిక కార్యక్రమాల్లోనూ బొత్స పాల్గొంటారు. అక్కడ జరిగే రక్తదాన శిబిరాలు తదితర కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.

మరిన్ని వార్తలు