13న కషాయాలు, ద్రావణాలపై శిక్షణ

8 Aug, 2017 01:00 IST|Sakshi

రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో ఈనెల 13న ప్రకృతి వ్యవసాయ విధానంలో తెగుళ్లు, చీడపీడల నివారణకు ఉపయోగించే కషాయాలు, ద్రావణాల తయారీ, ఉపయోగించే విధానంపై రైతు శాస్త్రవేత్తలు విజయ్‌కుమార్‌ (కడప జిల్లా), ధర్మారం బాజి (గుంటూరు జిల్లా) రైతులకు శిక్షణ ఇస్తారు. పాల్గొనదలచిన రైతులు ముందుగా పేర్ల నమోదుకు 97053 83666, 0863 – 2286255 నంబర్లలో సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు