నిలిచిపోయిన 108 సేవలు

16 Feb, 2018 12:31 IST|Sakshi

సాక్షి, విశాఖ: విశాఖ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 108 సేవలు నిలిచిపోయాయి. అంబులెన్స్‌లకు మరమ్మత్తులు చేయాలంటూ అధికారులు బ్రేక్‌ డౌన్ ప్రకటించారు. దీంతో పెదగంట్యాడ పీహెచ్‌సీలో అంబులెన్స్‌లు ఎక్కడికక్కడ నిలిపివేశారు. అయితే 108 నిలుపుదలపై మీడియా చిత్రీకరిస్తుండగా అధికారులు హడావిడిగా కొన్ని వాహనాలను లోకేషన్లకు పంపారు. 
 

మరిన్ని వార్తలు