హైదరాబాద్ వాసులకు గాయాలు
సాక్షి, విశాఖ: విశాఖ జిల్లాలో ఆరిలోవ సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. స్థానిక సాయి బాబా గుడి వద్ద లారీ డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టుకుంటూ ఇన్నోవాపై పడింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో నలుగురు హైదరాబాద్కు చెందిన వారు. బాధితులు సింహాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.