రెండు బైక్‌లు ఢీ..ఇద్దరి మృతి

4 Jan, 2018 08:11 IST|Sakshi

విజయనగరం : దత్తిరాజేరు మండలం వంగర గ్రామం వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందారు. మృతులు దత్తిరాజేరు మండలం వంగర గ్రామానికి చెందిన  నాగోలు ప్రసాద్ (30) కాగా మరొకరు  గజపతినగరం మండలం  మరుపల్లి గ్రామానికి చెందిన గెద్ద ఈశ్వరరావు(20)లుగా గుర్తించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు