మాజీ ప్రధానికి ఏడేళ్ల జైలు శిక్ష

24 Dec, 2018 17:07 IST|Sakshi

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక న్యాయస్థానం సోమవారం షాకిచ్చింది. అల్అజీజియా మిల్స్ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో నవాజ్ షరీఫ్‌కు ఏడేళ్లు జైలు శిక్షతో పాటు 25 మిలియన్ డాలర్ల జరిమానాను విధించింది. పెట్టుబడులకు సంబంధించి ఆదాయ వనరులను షరీఫ్ చూపించలేక పోయారని కోర్టు పేర్కొంది.

మరిన్ని వార్తలు