వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : పట్టణంలోని స్వర్ణకారుడు హరి యాదవ్ సూక్ష్మ పరిమాణంలో 300 పాయింట్ల బంగారంతో చేసిన హెల్మెట్ను అర్బన్ సీఐ సదాశివయ్యకు బహూకరించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ఆవశ్యకతను తెలియచేస్తూ బంగారు హెల్మెట్ను తయారు చేసినట్లు స్వర్ణకారుడు తెలిపాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం అర్బన్ సీఐకి అందజేశాడు.