వైఎస్ హయాంలో జరిగిన రుణమాఫీతో ఎందరో రైతులు లబ్ధిపొందారు. వారంతా నాటి పరిస్థితులను తలచుకుంటున్నారు. ‘‘పంటలు పండక కరువు పరిస్థితిలో అప్పులపాలైన సమయంలో నాడు వైఎస్ చొరవతో రైతులకు పంట రుణాలను మాఫీ చేశారు. మాకు రూ.30 వేల పంట రుణం మాఫీ అయింది.
వైఎస్ మనసున్న మారాజు.. ఇప్పుడు ఎక్కడున్నాడో కానీ.. మేమంతా ఆయనకు రుణపడి ఉంటాం’’ అని సిద్దిపేట జిల్లా గుగ్గిల్లకు చెందిన మైల బాలయ్య గుర్తుచేసుకున్నారు. ‘‘వైఎస్లాంటి నాయకుడు ఇక రాడు. రైతుల కష్టాలు తెలిసిన నేత ఆయన. వైఎస్ హయాంలో నాకు రూ.లక్ష దాకా మాఫీ అయింది. మేమంతా ఆయనకు రుణపడి ఉంటాం’’ అని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన అయిలేని శంకర్రెడ్డి పేర్కొన్నారు.
- అయిలేని శంకర్రెడ్డి, మైల బాలయ్య