ఇద్దరు యువతుల వివాహం

26 Dec, 2017 14:10 IST|Sakshi

పురుషుడి అవతారమెత్తిన ఓ యువతి

సాక్షి, జమ్మలమడుగు: సాధారణంగా పెళ్లి అంటే యువతి, యువకుడికి జరుగుతుంది. కానీ విపరీత ధోరణుల కాలం కావడంతో ఓ యువతి మరో యువతిని వివాహమాడిన సంఘటన వైఎస్ఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. మౌనిక, రమాదేవి అనే ఇద్దరు యువతులు వివాహం చేసుకున్నారు. రమాదేవి మగ అవతారమెత్తి మౌనిక అనే యువతిని వివాహం చేసుకుంది. విషయం తెలిసిన మౌనిక బంధువులు జమ్మలమడుగు డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా, గతంలోనూ రమాదేవికి మరో ఇద్దరు యువతులతో వివాహమైనట్లు తెలుస్తోంది.

వింత పెళ్లి..పెద్ద లొల్లి

మరిన్ని వార్తలు