యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో కాగితపు బ్యాగుల తయారీపై శిక్షణ ఇస్తున్న దశ్యం
2 / 8
రాహ్ గిరి సభ్యులు ఆదివారం(24-05-2015) రాయదుర్గంలో సందడి చేశారు. ఇక్కడి బయో డైవర్శిటీ పార్కు నుంచి మాదాపూర్ లోని మైండ్ స్పేస్ జంక్షన్ వరకున్న రోడ్డును వివిధ రకాల ఆటపాటలతో నింపేశారు. యూత్ ఫర్ సేవ ప్రతినిధులు.. ఇక్కడకు వచ్చినవారికి సెల్ఫ్ డిఫెన్స్, కాగితపు బ్యాగుల తయారీపై అవగాహన కల్పించారు. దీంతోపాటు ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే యోగాసనాలు వేయించారు. యేటా పాఠశాలలు తెరిచే సమయంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందించే కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలని కోరారు. ఈ రాహ్ గిరిలో సైక్లింగ్, స్కేటింగ్, రన్నింగ్, వాకింగ్, ఫుట్ బాల్, క్రికెట్, స్ట్రీట్ గేమ్స్ తో ప్రతి ఒక్కరూ ఆనందంగా గడిపారు. - రాయదుర్గం