నిండు వేసవిలో సూర్యభగవానుడు హాట్హాట్గా మారాడు. నిప్పుల వర్షం కురిపిస్తూ తన ప్రతాపం చూపిస్తున్నాడు. తిరుమలలో భక్తులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆలయ వీధులు బోసిపోయాయి. టీటీడీ అధికారులు దీనిని ముందుగానే గుర్తించి చల్లదనం పెంచే చర్యలు చేపట్టారు. ఆలయం వద్ద కార్మికులు ట్యాంకర్లతో నీటిని చల్లుతూ వాతావరణాన్ని చల్లబరుస్తున్నారు.