వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు..పలు కేసుల్లో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గురువు నిత్యానంద మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. తన దేశంగా ప్రకటించుకున్న ఈ స్వామి ‘రిజర్వ్ బ్యాంకు ఆఫ్ కైలాస’ను ప్రారంభించారు. 2020, ఆగస్టు 22వ తేదీ వినాయక చవితి రోజున ప్రారంభిస్తానని చెప్పినట్లుగానే..చేశారు. కైలాస దేశానికి చెందిన నాణేలను కూడా విడుదల చేయడం విశేషం. ఆర్బీకే నాణేలు బంగారంతో చేసినవంటూ..ఆయన చెప్పారు. కైలాస దేశం కరెన్సీ అన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుందని వెల్లడించారు. ఓ దేశంతో చట్టబద్దంగా ఎంవోయూ కుదుర్చుకున్నట్లు స్పష్టం చేస్తున్నారు. కానీ ఏ దేశంతో ఒప్పందం చేసుకున్నారో ప్రకటించలేదు. మూడు రోజుల క్రితం నిత్యానంద ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో రిజర్వ్ బ్యాంకు ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. గణపతి దయతో కైలాస రిజర్వ్ బ్యాంకును ప్రారంభించనున్నట్లు ఆ వీడియోలో తెలిపారు. రిజర్వ్ బ్యాంకు కోసం ఆర్థిక విధానం పేరిట 300 పేజీల నోట్ సిద్ధం చేసినట్లు, వాటికన్ బ్యాంకు తరహాలో నిర్మాణాత్మకంగా ఉంటుందన్నారు. కైలాస అనేది నిత్యానంద పెట్టుకున్న దేశం పేరు. స్వయంగా తానే ప్రధాన మంత్రి అంటూ ప్రకటించుకున్నారు. భారతదేశంలో నమోదైన పలు కేసుల్లో ఇతను పారిపోయాడు. కానీ అతను ప్రకటించుకున్న దేశం ఎక్కడుందో తెలియదు. అయితే..ఈక్వెడార్ తీరంలో నిత్యానంద కొనుగోలు చేసిన ఓ ద్వీపంలో ఉందని ప్రచారం జరుగుతోంది. అధికారిక వెబ్ సైట్ కూడా రూపొందించారు. హిందూ మతాన్ని పాటించకపోతున్న వారి కోసమే కైలాసను స్థాపించడం జరిగిందని నిత్యానంద వెల్లడించారు అత్యాచారం, కిడ్నాప్ కేసులు ఎదుర్కొంటున్న వివాదాస్పద గురువు నిత్యానంద మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానందా తనకంటూ ప్రత్యేకంగా ఒక దేశాన్నే ఏర్పారుచుకున్నారు. దానికి కైలాసదేశం అని కూడా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. అయితే వినాయక చవితి రోజు కైలాసం దేశానికి కొత్త రిజర్వు బ్యాంకు, కొత్త కరెన్సీ, కొత్త చట్టాలు ప్రారంభిస్తున్నట్లు మరోసారి నిత్యానంద సంచలన ప్రకటనలు చేశారు. దేశం విడిచి పారిపోయిన నిత్యానందకు కొత్త రిజర్వ్‌ బ్యాంక్‌, కొత్త కరెన్సీ సృష్టించడం ఎలా సాధ్యమయ్యిందో తెలియడం లేదు. అంతే కాకుండా ఆ కరెన్సీ వేరే దేశాలలో కూడా చలామణి అవుతుందని నిత్యానంద ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఆ దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా తెలిపారు. అయితే ఆ దేశాలు ఏంటి అని మాత్రం ఆయన ప్రకటించలేదు. 300 పేజీలతో కూడా ఆర్థిక విధానాలను ఆయన తయారు చేశారు. భారతదేశానికి చాలా దూరంలో ఉన్న ఈక్విడార్‌ సమీపంలోని ఒక చిన్నదీపంలో నిత్యానంద ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ దేశం ఎక్కడ ఉందో ఇప్పటి వరకు ఆయనకు, ఆయన అనుచరులకు తప్ప ఎవరికీ తెలియదు. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలోని ఈక్విడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపంలో మకాం వేసిన నిత్యానందస్వామి వినాయక చవితి రోజు ప్రపంచానికి షాక్ ఇచ్చారు. నిత్యానందస్వామితో పాటు ఆయన అనుచరులు శనివారం వినాయక చవితి సందర్బంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ కైలాసాని నిత్యానందస్వామి స్థాపించారు. అందులో కైలాసదేశం ప్రధాన మంత్రి పదవి గురించి ప్రస్తావించిన నిత్యానంద అందర్నీ ఆచ్చర్యానికి గురిచేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో నిత్యానంద తాను తాను హిందూ సంస్కర్తను కానని, పునర్జీవిని అంటూ చెప్పారు. హిందూ మతాన్ని పాటించే వారు హక్కులు కోల్పోవడం వలనే కైలాసదేశం స్థాపించానని, అక్కడ మానవత్వం ఉన్న ఎవరికైనా చోటు ఉంటుందని, ఆ దేశంలో ప్రతిఒక్కరికి జ్ఞానోదయం అవుతోందని నిత్యానందస్వామి చెప్పారు.