తోడేళ్ల దాడిలో ఐదు గొర్రెలు మృతి

8 Mar, 2023 02:06 IST|Sakshi

తాంసి: తోడేళ్ల దాడిలో ఐదు గొర్రెలు మృతిచెందిన ఘటన భీంపూర్‌ మండలంలోని తాంసి(కె) గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బుషి రమేష్‌ యాదవ్‌ రోజులాగా తన గొర్రెలను సాయంత్రం సమయంలో గ్రామ సమీపంలోని పాకలో ఉంచాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో కొట్టంలోని గొర్రెలపై తోడేళ్లు దాడి చేసి ఐదు గొర్రెలను హతమార్చాయి. రైతు రాత్రి సమయంలో గొర్రెలను చూసేందుకు వెళ్లగా అప్పటికే మృతిచెంది కనిపించాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చేరుకుని తోడేళ్ల దాడిలో మృతిచెందినట్లుగా భావించారు. దీంతో రూ.40వేల వరకు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు