ఎన్‌హెచ్‌ 65కు మహర్దశ, ధర ఎంతైనా తగ్గేదేలే.. మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి!

6 Jan, 2023 19:16 IST|Sakshi

నా కష్టార్జితం కూడపెట్టి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఓ ప్రోపర్టీ కొనాలనుకుంటున్నాను. కానీ ఎక్కడ కొనాలో అర్థం కావడం లేదు. అభివృద్ధి చెందిన ప్రాంతంలో కొందామంటే, అందుబాటులో రేట్లు లేవు. ఓ 2-3 ఏళ్లలో మనం పెట్టిన సొమ్ము కు తగిన రాబడి అందించే విధంగా ప్రాపర్టీ కొనాలనే కోరిక. ఇదే రకమైన భావనలో మీరు ఉంటే..

దక్షిణ భారత దేశంలో అతిపెద్ద ప్లాట్‌ ప్రమోటర్‌ జీ స్కైర్‌ హౌసింగ్‌ గ్రూప్‌. వేగంగా అభివృద్ధి చెందతున్న హైదరాబాద్‌ విజయవాడ హైవే (ఎన్‌హెచ్‌ 65 )లో సౌత్‌ ఇండియాలోనే తొలిసారి 368 ఎకరాల్లో వరల్డ్‌ క్లాస్‌ ప్రీమియం విల్లా ప్లాట్లతో 1242 ఎకరాల్లో ఇంటీగ్రెటెడ్‌ సిటీని నిర్మిస్తుంది. హెచ్‌ఎండీఏ, రెరా అనుమతులతో 267 నుంచి 533 స్కైర్‌ యార్డ్స్‌లో నిర్మిస్తున్న జీ స్కైర్‌ ఎపిటాన్‌లో వివిధ రకాలైన లైఫ్‌ స్టైల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్ ఫెసిలిటీస్‌తో 5.65 ఎకరాల్లో హైదరాబాద్‌ లార్జెస్ట్‌ క్లబ్‌ హౌస్‌, వరల్డ్‌ క్లాస్‌ ప్రీమియం, అవుటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపల అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలున్నాయి. నగర పరిసర ప్రాంతాల్లో తమ కలల సౌధాన్ని లేదంటే విల్లాలను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం అంటోంది జీ స్కైర్‌ హౌసింగ్‌ గ్రూప్‌.


మరోవైపు హైలీ సెక్యూర్‌ జోన్‌లో 24 గంటలూ సీసీటీవీ సర్వేలైన్స్‌తో పాటు 100 ఎకరాల్లో గోల్ఫ్‌ కోర్స్‌ 40 ఎకరాల్లో లగ్జరీ రిసార్ట్‌, వెల్‌నెస్‌ సెంటర్‌, స్పోర్ట్స్‌ అకాడమీ, స్కూల్స్‌, కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. అత్యున్నత జీవన ప్రమాణాలను అందించేలా ప్రతి ఒక్కరి కలల గమ్యంగా మార్చేలా కొండ ప్రాంతాలు, వ్యవసాయ క్షేత్రాలు, 279 ఎకరాల విశాలమైన సహజ సరస్సు మధ్య జీ స్క్వేర్ ఎపిటామ్ ఇంటిగ్రేటెడ్ సిటీ హైదరాబాద్‌లోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తుంది.

ఆహ్లాదకరమైన ప్రకృతి, కాలుష్య రహిత వాతావరణం, తూర్పు హైదరాబాద్‌కు అదనపు ఆకర్షణతో అందుబాటు ధరలు, మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల వల్ల ఎన్నో కంపెనీలు తమ విస్తరణ కోసం ఈ కారిడార్‌ వైపు చూస్తున్నాయి. ఐటీ, హెల్త్‌ కేర్‌, ఆటోమొబైల్‌, 5ఐటీ పార్క్‌లు, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్స్‌, ఎంఎస్‌ఎంఈలు, లాజిస్టిక్‌ హబ్‌ల నిర్మించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. 247 కిలోమీటర్ల దూరాన్ని కలుపుతున్న హైదరాబాద్‌ - విజయవాడ హైవే కారిడార్‌‌లో పెట్టుబడులకు అనువైన సమయమంటూ ఈ ప్రాంతంలో స్థలాలు కొన్న వారు భవిష్యత్‌లో మంచి రాబడులు పొందగలరని చెబుతున్నారు.

అందుకు ఊతం ఇచ్చేలా పశ్చిమ హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గించడంతో పాటుగా తూర్పు హైదరాబాద్‌ అభివృద్దే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. దండుమల్కాపూర్‌ (ఎన్‌హెచ్‌ 65 సమీపంలోని గ్రామం) వద్ద ఎంఎస్‌ఎంఈ గ్రీన్‌ ఇండస్ట్రీయల్‌ పార్క్‌ ఇప్పుడు అభివృద్ధి చేస్తుండటం, కేంద్ర ప్రభుత్వం విజయవాడ హైవేను త్వరలోనే ఆరు లైన్‌ రోడ్‌గా విస్తరించనున్నామని త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తామని వెల్లడించడంతో ఆరు లైన్ల రోడ్డు దగ్గర ప్రాపర్టీ అంటే ఆస్తి విలువ కూడా గణనీయంగా కూడా పెరుగుతున్నట్లేనని రియాల్టీ పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి.

ఈ సందర్భంగా జీస్వైర్‌ హౌసింగ్‌ సీఈవో ఎన్‌.ఈశ్వర్‌ మాట్లాడుతూ..ఇప్పటికే మేం జీ స్కైర్‌ ఈడెన్‌ గార్డెన్‌ పేరుతో బీఎన్‌ రెడ్డీ నగర్‌లో చేపట్టిన ప్రాజెక్ట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు అదే తరహాలో జీస్కైర్‌ ఎపిటామ్‌ పేరుతో హైదరాబాద్‌ -విజయవాడలను కలిపే జాతీయ రహదారి మార్గంలో 1242 ఎకరాల్లో కస్టమర్ల లైఫ్‌స‍్టైల్‌కు అనుగుణంగా ప్రాజెక్ట్‌ నిర్మాణాలను చేపడుతున్నాం. పెట్టుబడులకు అనువైన సమయమంటూ ఈ ప్రాంతంలో స్థలాలు కొన్న వారు భవిష్యత్‌లో మంచి రాబడులు పొందగలరని ధీమాగా చెబుతున్నారు. అందుకే ఇప్పుడే పెట్టుబడులు పెట్టండి.. మీ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోండి. (అడ్వర్టోరియల్)

మరిన్ని వార్తలు