జి.మాడుగుల: బోయ, వాల్మీకులను, బొంతిరియ కులాలను ఆదివాసీ జాబితాలో చేర్చుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆదివాసేతర బడా భూస్వాముల కార్పొరేటు సంస్థల ప్రయోజనాలు నెరవేర్చడానికేనని సీపీఐ మావోయిస్టు ఆంధ్ర–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక విలేకర్లకు మంగళవారం మావోయిస్టు పార్టీ నుంచి ప్రకటన విడుదల చేశారు. ఆదివాసీలకు జల్, జంగల్, జమీన్పై హక్కులను, అధికారాన్ని కాలరాసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. బోయలు, వాల్మీకులను ఎస్టీలో చేర్చడాన్ని ప్రతిపక్ష టీడీపీ, బీజేపీలు కూడా సమర్ధించి, తమ వర్గ స్వభావాన్ని చాటుకున్నాయని ఆ ప్రకటనలో విమర్శించారు.
మావోయిస్టు ఆంధ్ర–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్